Saturday 23 February 2013

GREAT PEOPLE

కీ. శే . శ్రీ దొమ్మేటి వీరం శెట్టి గారు:  దొమ్మేటి వెంకట రెడ్డి గారు 26. 02. 1928 లో చనిపోయిన  తరువాత  తూర్పు, పశ్చిమ, కృష్ణ జిల్లాల సెట్టిబలిజ సంఘానికి అధ్యక్షులుగా ఉండి సంఘ్ వ్యహరములు పరిసీలించిరి.

కీ. శే . శ్రీ దొమ్మేటి సూర్యనారాయణ గారు: వీరం శెట్టి గారి తరువాత వీరు సెట్టిబలిజ సంఘమునకు అధ్యక్షులుగా ఉండిరి. అమలాపురం ఆనరారి మేజిస్ట్రేట్ గ కొంతకాలము, తాలూకా బోర్డు మెంబెర్ గ కొంతకాలము పనిచేసిరి.

కీ. శే. శ్రీ దొమ్మేటి వీరరాఘవులు గారు,  కీ.శే. దొమ్మేటి ఎర్రప్ప శెట్టి గారు, కీ. శే. శ్రీ దొమ్మేటి వెంకట రెడ్డి నాయుడు గారు, శ్రీ దొమ్మేటి సాహేబు నాయుడు గారు : వీరు అందరు కూడా సంఘానికి  ఏంతో సేవ చేసినారు.

కీ.శే. శ్రీ దొమ్మేటి గోపాల కృష్ణ గారు: 1942 నుండి 1968 వరకు సెట్టిబలిజ సంఘానికి ఉపాద్యక్షులుగా  ఉండిరి. వీరు రంగూన్ లో క్రికెట్ బోర్డు ఆఫిసియాల్ ఎంపైర్ గా  1942 నుండి 1960 వరకు పనిచేసిరి.

కీ.శే. శ్రీ గుబ్బల రామన్న గారు : వీరిది అల్లవరం. 1920 లో సంఘమును స్తాపించింది మొదలు 1929 వరకు  సంఘ గౌరవ కార్యదర్శిగాను, తూర్పు గోదావరి జిల్లా బోర్డు మెంబెర్ గాను పనిచేసిరి. సంఘ మూలనిధిని వసూలు చేయుటకు వెంకట రెడ్డి గారితో రంగూన్ వెళ్లి నిధి సేకరణలో పాటుపడిరి.


No comments:

Post a Comment